అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఆవరణలో సోమవారం ఆక్సిజన్ ప్లాంట్లో సాంకేతిక లోపం తలెత్తింది. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. టెక్నీకల్ సిబ్బంది వెంటనే ప్లాంట్ను షట్డౌన్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మెడికల్ సూపరింటెండెంట్ రమేష్ మాట్లాడుతూ, సిలిండర్లోని మీటర్ 15 పాయింట్ల నుండి 5 పాయింట్లకు పడిపోవడంతో సాధారణ స్థితికి వచ్చిందని, తద్వారా తీవ్ర ప్రమాదం తప్పిందని తెలిపారు.