పీలేరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో, సుధాకర్ బాబు అధ్యక్షతన స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టి పీలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని వారు కోరారు. పీలేరు చుట్టూ పది మండలాలకు ఇది సౌకర్యవంతంగా ఉండి, ప్రభుత్వ శాఖలు ప్రజలకు చేరువ అవుతాయని తెలిపారు.