విద్యార్థికి రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు అవకాశం

వాల్మీకిపురం మండలం కొత్త మంచూరు ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి నెట్ బాల్ సెలక్షన్ పోటీల్లో మదనపల్లెకు చెందిన ప్రైవేట్ స్కూల్ విద్యార్థి వెంకట విశ్వ సాయి U-17 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం పీడీ రెడ్డి వరప్రసాద్ తెలిపారు. విశ్వ సాయి కృషి, క్రమశిక్షణను ఆయన అభినందించారు. పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు కూడా విద్యార్థి ప్రతిభను కొనియాడారు.

సంబంధిత పోస్ట్