ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తికి చెందిన సంజీవ రాయుడు కుటుంబం బస్సు ప్రయాణంలో పొరపాటున వేరే బ్యాగ్ తీసుకుని గోరంట్లకు వెళ్లారు. తమ బ్యాగ్లో సుమారు 7 తులాల బంగారం ఉందని గుర్తించి, పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్ను ఆశ్రయించారు. సీఐ శ్రీరామ్ వెంటనే సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, బ్యాగ్ను గుర్తించి, నగలతో సహా బాధితులకు భద్రంగా అందజేశారు.