ఆదివారం రాత్రి వేంపల్లె హనుమాన్ జంక్షన్ వద్ద టీడీపీ నేత గోపినాథ్ రెడ్డి, రాఘవరెడ్డి వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. పరస్పర ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ ఘర్షణలో, రాఘవరెడ్డి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై, గోపినాథ్ రెడ్డి ఫిర్యాదు మేరకు మిగిలిన వారిపై కేసులు నమోదు చేశారు.