ఉప్పాడ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి వంద రోజుల గడువు కోరారు. మూడు రోజుల్లో కాలుష్యాన్ని పరిశీలించి, తీర కోత నివారణకు కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. పొల్యుషన్ ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పరిశ్రమలు అభివృద్ధికి అవసరమని, కానీ మత్స్య సంపదకు నష్టం కలగకుండా చూడాలని పేర్కొన్నారు.