పిఠాపురం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పి. స్వాతి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, పంటలు సాగు చేసే రైతులు అక్టోబర్ 25వ తేదీలోపు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలి. అన్నదాత సుఖీభవ, పంటల భీమా, పంట నష్టపరిహారం వంటి పథకాలు ఈ క్రాప్ నమోదు చేసుకున్న వారికే వర్తిస్తాయి. రైతు సేవా కేంద్రాల ద్వారా చేపట్టే ధాన్యం కొనుగోలుకు కూడా పంట నమోదు తప్పనిసరి అని ఆమె వివరించారు.