AP: కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రత, సౌకర్యాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో సమీక్ష నిర్వహించిన ఆయన, క్యూ లైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లలో విభాగాల సమన్వయం అవసరమని సూచించారు. కాశీబుగ్గ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఆలయాల వద్ద కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.