అంబాజీపేట మండలంలోని వాకలగరువు పుష్కరఘాట్ వద్ద సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయసున్న ఈ మృతదేహం గోదావరి నదిలో కొట్టుకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.