కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో బుధవారం తెల్లవారుజామున కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు ప్రారంభమయ్యాయి. మంత్రి కొల్లు రవీంద్ర సముద్ర హారతి ఇచ్చి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేద పండితులు వేదమంత్రాలతో సముద్రుడికి హారతులు అర్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో సముద్ర స్నానాలు ఆచరిస్తూ పవిత్ర స్నానాల పుణ్యాన్ని అందుకుంటున్నారు.