పమిడిముక్కల మండలం రెడ్డిపాలెం గ్రామం శివారులో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు గురువారం సాయంత్రం దాడి చేశారు. ఏపీ గేమింగ్ యాక్ట్ 9(1) ప్రకారం జూదం ఆడుతున్న 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 7,760 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.