దుర్గమ్మ సన్నిధిలో సినీ హీరో నారా రోహిత్ దంపతులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని సినీ హీరో నారా రోహిత్, ఆయన సతీమణి శిరీష దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ఈ నూతన దంపతులు అమ్మవారి ఆశీస్సుల కోసం ఆలయాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కి కుటుంబ సంబంధీకుడైన నారా రోహిత్ దంపతులకు దుర్గగుడి చైర్మన్ శ్రీ. బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు నారా రోహిత్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం, చైర్మన్ మరియు ఈఓ అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి, వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్