ఆలూరు: ఎమ్మెల్యే విరుపాక్షి వ్యాఖ్యలపై వైకుంఠం జ్యోతి ఫైర్

ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి మంగళవారం ఆలూరులో తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు వయసు, అక్రమ మద్యం వంటి అంశాలపై ఎమ్మెల్యే చేసిన వ్యక్తిగత విమర్శలు అసభ్యకరమని, రాజకీయ మర్యాదలకు విరుద్ధమని ఆమె అన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణలకు దిగడం దురదృష్టకరమని, ఇటువంటి తప్పుడు ఆరోపణలు వెంటనే మానుకోవాలని వైకుంఠం జ్యోతి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్