బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంగళవారం, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 41 మంది లబ్ధిదారులకు రూ. 25.98 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆయన వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. పేదల ఆరోగ్య రక్షణలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన ఘనత సీఎం చంద్రబాబుదని మంత్రి అన్నారు.