కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంగళవారం రాత్రి కోడుమూరు మండలంలోని సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల ప్రభుత్వ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల భద్రత, పోషకాహారం, విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం, బోధన, యూనిఫాంలపై వివరాలు తెలుసుకున్నారు. భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, భద్రత, శుభ్రత, మరమ్మతులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.