మద్దికేర మండలం పెరవలి గ్రామంలోని శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో మంగళవారం ఏడు నెలల హుండీ లెక్కింపు జరిగింది. ఈ ఏడాది మొత్తం ఆదాయం రూ. 11,13,349గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 10,62,160 ఆదాయం రాగా, ఈ సంవత్సరం రూ. 51,189 అధికంగా వచ్చింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో డివిజన్ తనిఖీ అధికారి వెంకటేశ్, ఈవో వీరయ్య, ఛైర్మన్ పారా రవికుమార్, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.