కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, ఉసిరి చెట్టు వద్ద దీపారాధనలో పాల్గొన్నారు. వేలాదిమంది భక్తులు కూడా ఆలయ ప్రాంగణంలో భక్తిపూర్వక వాతావరణంలో పాల్గొన్నారు.