ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీలో శ్రీ కృష్ణమఠం ఆధ్వర్యంలో జరుగుతున్న 87వ విశ్వశాంతి యాగం మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ యాగంలో జిల్లా కలెక్టర్ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. పండితుల నేతృత్వంలో హనుమత్, సుబ్రమణ్య, చండీహోమాలు నిర్వహించారు. ప్రజల సుఖసంతోషాలకై ఈ యాగం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఏ. సిరి తెలిపారు.