గుంటూరు జిల్లా తురకపాలెంలో మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి. గత ఐదు నెలల్లో గ్రామంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. బాధితులలో పలువురు ఆర్ఎంపీ క్లినిక్లో చికిత్స పొందినట్లు గుర్తించడంతో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆ క్లినిక్ను సీజ్ చేసింది. ఈ మరణాలకు మెలియాయిడోసిస్ అనే ఇన్ఫెక్షన్ కారణమై ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. అధికారులు విచారణ స్టార్ట్ చేశారు.