కందుకూరు: అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు

రైతులకు విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు కందుకూరు శేషారెడ్డి హెచ్చరించారు. సోమవారం లింగసముద్రంలో శ్రీ లక్ష్మీ వెంకట సాయి సీడ్స్ షాపును వ్యవసాయ అధికారి సీహెచ్పీఎల్ దుర్గాతో కలిసి తనిఖీ చేశారు. డీలర్లు విత్తన స్టాక్ రిజిస్టర్ను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని, రైతులకు రసీదు ఇవ్వాలని, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్