నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాకిచర్ల పంచాయతీ, పెద్దపట్టపుపాలేనికి చెందిన ఆవుల గోపి (37) అనే వ్యక్తి, తన భార్యతో కలిసి విడవలూరు మండలం రామతీర్థం గ్రామ శివారులో రొయ్యల చెరువు వద్ద ఏడాదిగా పనిచేస్తున్నాడు. ఆదివారం మోటారు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. మృతుడి భార్య సోమవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.