రాష్ట్ర న్యాయ, చట్ట, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ బుధవారం సాయంత్రం 3 గంటలకు నంద్యాల నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు నెల్లూరు ఆర్అండ్బి అతిథిగృహానికి చేరుకుంటారు. గురువారం ఉదయం 8 గంటలకు మైనార్టీ సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం, నారా లోకేష్తో కలిసి దగదర్తిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు.