ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రారంభించిన విపిఆర్ నేత్ర కార్యక్రమం రెండో రోజు వరికుంటపాడు మండలం రామాపురం పంచాయతీలో జరిగింది. ఈ కార్యక్రమంలో 231 మంది ప్రజలకు సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 163 మందికి అద్దాలు అవసరమని గుర్తించి, వారికి అద్దాలు అందజేశారు. విపిఆర్ నేత్ర బస్సును బుధవారం ఉదయం 9 గంటల నుంచి వేంపాడు పంచాయతీలో నిర్వహించనున్నారు.