AP: అనంతగిరి మండలంలోని గూడెం గ్రామంలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో విద్యుత్ సౌకర్యం అందింది. 5 నెలల క్రితం గిరిజన సమస్యలను పవన్ కళ్యాణ్కు వివరించడంతో, డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అల్లూరి జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు. 17 ఆవాసాలకు 9.6 కిలోమీటర్ల మేర అడవులు, కొండల్లో విద్యుత్ లైన్లు వేయడానికి రూ.80 లక్షలకు పైగా ఖర్చయింది.