AP: అనకాపల్లిలోని రాజయ్యపేటలో మంత్రి అనితను మత్స్యకారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారు. ‘బయట నుంచి వచ్చిన వ్యక్తులే మత్స్యకారులను రెచ్చగొట్టారు. అమాయకులైన ప్రజలతో రాజకీయాలు చేయొద్దు. మత్స్యకారుల కోరిక మేరకు బల్క్ డ్రగ్ పార్క్ పనులు నిలిపేయిస్తా. 2024 ఫిబ్రవరిలో వైసీపీనే దీనికి వర్చువల్గా శంకుస్థాపన చేసింది’ అని వెల్లడించారు.