వెలుగొండ ప్రాజెక్టు సొరంగంలో ఊడిపడ్డ పెచ్చులు

ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు 2వ సొరంగంలో సోమవారం అకస్మాత్తుగా పెచ్చులూడి రాళ్లు కిందపడటంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నిర్మాణ పనులకు ఆటంకం కలిగించింది. సొరంగంలో రాళ్లు పడుతున్న భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అడ్డుగా పడిన రాళ్లను తొలగించే పనులు జరుగుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్