సింగరాయకొండ మండలంలో వరద బాధితులను పరామర్శించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీఎం చంద్రబాబు ముందు చూపు వల్లే రాష్ట్రం పెద్ద విపత్తు నుంచి బయటపడిందని అన్నారు. ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోగలిగామని, అనుభవజ్ఞుడైన చంద్రబాబు సాంకేతిక పరిజ్ఞానంతో సమస్యలను అధిగమించారని తెలిపారు.