సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అలజడి

ఒంగోలు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు కార్యాలయంలోకి ప్రవేశించగానే, ఒక ఉద్యోగి కొంత నగదును బయటకు విసిరివేశాడు. అప్రమత్తమైన అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాత్రూంలో దాచిపెట్టిన మరో రూ.10 వేలతో కలిపి మొత్తం రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్