ఒంగోలులో శుక్రవారం, కులం పేరుతో దూషించిన పవన్ కుమార్ అనే వ్యక్తికి ఒంగోలు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. చిన్నపిల్లల తగాదాలో బాలుడి తండ్రిని దూషించి, బాలుడిని నిర్బంధించిన కేసులో ఈ శిక్ష పడింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో, కోర్టు నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ. 17 వేల జరిమానా విధించింది.