ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుకగా ప్రమోషన్లు: సీఎం

AP: ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. దీపావళి కానుకగా ప్రమోషన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే మహిళా ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు అని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులది కూడా కీలక పాత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక గత ప్రభుత్వం రూ. 7 వేల డీఏలు పెండింగ్ లు పెట్టిందని తెలిపారు. వైసీపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్