ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రస్తుతం రాష్ట్రంలో పీ4 విధానం అమలు చేస్తున్నాం. ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో సమ్మిళిత వృద్ధిరేటు సాధనకు చర్యలు. స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరో స్పేస్ సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. జనవరి నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ ఏర్పాటుకు చర్యలు. రెండేళ్లలో రాష్ట్రంలో క్వాంటం కంప్యూటర్ల తయారీ చేపడతాం’’ అని సీఎం వివరించారు.