AP: ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే క్వింటా ఉల్లికి రూ.1,200 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. దీంతో పాటు వారి పంటతో సంబంధం లేకుండా ఈ-పంట ఆధారంగా హెక్టారుకు రూ.50 వేలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు తెలపారు. సాగు విస్తీర్ణం పెరగడం, వర్షాల వల్ల ఉల్లి ధర తగడంతో హెక్టారుకు రూ. 50 వేలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు రైతులకు లబ్ధి చేకూరనుంది.