AP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు శుభవార్త చెప్పనున్నాయి. దీపావళి కానుకగా పీఎం కిసాన్ 21వ విడత నిధులు (రూ.2 వేలు) విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. అలాగే ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ నిధులు (రూ.5 వేలు) కూడా జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దాంతో రైతుల ఖాతాల్లో త్వరలో రూ.7 వేలు చొప్పున జమ కానున్నాయి.