టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ మరోసారి నియమితులయ్యారు. దీంతో బుధవారం అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈవోగా నియమితులైన ఆయన 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొద్దికాలం కొనసాగారు. ప్రస్తుత టీటీడీ ఈవో శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే.