AP: నకిలీ మద్యం కేసులో షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం జీవీజీ అశోక్కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉండవల్లిలో 'ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్'ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ యాప్లో స్కాన్ చేస్తే మద్యం బాటిల్ వివరాలన్నీ తెలుస్తాయని, జియో ట్యాగింగ్ వల్ల ఎక్కడ అమ్మితే అక్కడే విక్రయించాల్సి ఉంటుందని చెప్పారు. నకిలీ మద్యం ఘటనలో ఎలాంటి రాజీ పడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.