వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల మనోభావాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు శనివారం తెలిపారు. గతవారం ఆలయ అధికారులు చేసిన మార్పులపై భక్తులలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, క్షేత్ర స్థాయిలో తీసుకునే ఏ మార్పులైనా భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.