ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో తెచ్చిన జిఎస్టీ 2.0 ఫలాలు చివరి వినియోగదారుని వరకు చేరడం సామాజిక బాధ్యత అని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. ఆదివారం నెల్లూరులో నెల్లూరు చార్టెడ్ అకౌంట్స్, ట్యాక్స్ బార్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జిఎస్టీ 2.0 సూపర్ జిఎస్టీ. సూపర్ సేవింగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.