నవంబర్ 8న కళ్యాణదుర్గం పట్టణంలో జరగనున్న కనకదాస విగ్రహావిష్కరణ, 538వ జయంతి ఉత్సవాలకు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ను సోమవారం అనంతపురంలో కలసి ఆహ్వానించారు ఉమ్మడి అనంతపురం జిల్లా కురుబ సంఘం నాయకులు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు అందజేసి, ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించాలని సంఘం నాయకులు కోరారు.