శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు బాలకృష్ణ తెలిపారు.