జలుమూరు: శత శాతం హాజరు తప్పనిసరి.. ఎంఈఓ మాధవరావు

జలుమూరు మండలం చల్లవానిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సోమవారం సందర్శించిన ఎంఈఓ బమ్మిడి మాధవరావు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శత శాతం ఉండేవిధంగా కృషి చేయాలని తెలిపారు. స్థానిక ఉపాధ్యాయుడు చౌదరి రవికుమార్‌తో మాట్లాడుతూ, విద్యార్థులు తప్పనిసరిగా సమయానికి పాఠశాలలకు చేరుకునేలా చూడాలని, ప్రార్థన సమయం అనంతరం హోంవర్క్‌లను తనిఖీ చేసి విద్యార్థులకు తగు సూచనలు అందజేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్