నరసన్నపేట: విద్యుత్ షాక్తో వృద్ధురాలి మృతి

నరసన్నపేట మండలం జల్లువాని పేటలో శనివారం సాయంత్రం విద్యుత్ షాక్ తో నక్క నాగమ్మ (61) అనే వృద్ధురాలు మృతి చెందింది. పశువుల కోసం గడ్డి కోసి వస్తుండగా పొలం గట్టుపై తెగిపడి ఉన్న విద్యుత్ వైర్ తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. స్థానికులు మృతదేహాన్ని గ్రామానికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్