నరసన్నపేట మండల కేంద్రంలోని రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో శనివారం భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతాలలో సుమారు 116 మంది దంపతులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వ్రతాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మురళి తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను ఉచితంగా అందజేశారు.