నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలోని రక్షిత మంచినీటి పథకం వద్ద పైపులైన్లు లీక్ అవ్వడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. సమాచారం అందిన వెంటనే పంచాయతీ అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని, అయితే ఒకటి రెండు రోజులు తాగునీటి సమస్య తప్పదని, వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.