AP: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లితండాలో ఒక వ్యక్తిలో మెలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలు కనిపించాయి. తీవ్ర జ్వరం రావడంతో రక్తపరీక్షలు నిర్వహించగా వ్యాధి బయటపడింది. బాధితుడిని మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేర్చగా, అతని పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా వైద్యాధికారి రవి తెలిపారు. ఇది అంటువ్యాధి కాదని, బురద, మట్టిలోని బ్యాక్టీరియాతో వ్యాపిస్తుందన్నారు.