AP: చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం ఎర్రికొంట వద్ద పేదలు నిర్మించుకున్న ఇళ్ల స్థలాలపై టీడీపీ నేతల కన్నుపడింది. దళితులకు ఇంటి స్థలాలు లేకపోవడంతో 10 కుటుంబాలు ఎర్రికొంట వద్ద గుడిసెలు వేసుకుని 20 ఏళ్లుగా జీవిస్తున్నారు. ఈ భూమిపై ఉపాధ్యాయురాలు దీనవతి, టీడీపీ నేత ఎత్తిరాజులునాయుడు కన్నుపడింది. 20 మందితో కలిసి ఇళ్లను ధ్వంసం చేయడానికి యత్నించారు. దళితులు అడ్డుకోవడంతో వారిపై దాడులకు దిగారు.