AP: కూటమి ప్రభుత్వాన్ని గెలిపించునందుకు ఏపీ ప్రజలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడిచేదన్నారు. అతినీతి ప్రభుత్వాన్ని కూలదోసి కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మిగతా పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పడతాయని.. బీజేపీ సిద్ధాంతం మీద, కేడర్ మీద ఆధారపడుతుందన్నారు.