ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PHC వైద్యులతో మరోసారి చర్చలు జరపనుంది. విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వైద్యారోగ్య శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీతో ఈ చర్చలు జరగనున్నాయి. ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ, PHC వైద్యుల నిరాహారదీక్ష మాత్రం యథాతథంగా కొనసాగుతుందని సమాచారం. చర్చలకు PHC వైద్యుల సంఘం రాష్ట్ర కమిటీ రానుంది.