AP: తనపై హత్యాయత్నం చేశారని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలతో నలుగురు తన మామిడి తోటలోకి వచ్చారని తెలిపారు. ప్రజలు తన పనులను మెచ్చుకుంటుండటంతో ఆయన భయపడ్డారని అన్నారు. రౌడీ షీటర్లు, ఆఫీస్ బాయ్, డ్రోన్ కెమెరామెన్ను పంపించారని, కారులో మరికొందరు కాపలా కాశారని చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.