ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా పత్తికొండలో బ్రేకులు ఫెయిలయ్యి ఓ లారీ ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అయితే మృతులు ముక్కెళ్ల గ్రామానికి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.