తిరుమల పరకామణి చోరీ.. సిట్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం

తిరుమల పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ చోరీపై సిట్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి పంపించేశారని లోకేష్ ఆరోపించారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలని, దేవుడిని కూడా వదలని దొంగలు తప్పించుకోలేరని, సిట్ విచారణతో నిజాలు తేలుస్తామని ఆయన తేల్చిచెప్పారు. వైసీపీ నేతలు మాత్రం చోరీని బయటపెట్టి, రవికుమార్ నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేశామని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్